సాక్షి, అన్నమయ్య జిల్లా: పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందారు. బైకు నుంచి వచ్చే పొగ పీల్చి ఊపిరాడక తాత, ముగ్గురు పిల్లలు మరణించారు.
బైకు పొగ పీల్చి ఊపిరాడక తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు మృతి చెందారు. బైకు సర్వీసింగ్ చేసి రాత్రంతా ఇంజిన్ ఆన్లో ఉంచడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


