టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు | TTD New Executive Officer J Shyamala Rao Takes Charge | Sakshi
Sakshi News home page

టీడీటీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు

Jun 16 2024 4:52 PM | Updated on Jun 16 2024 5:43 PM

TTD New Executive Officer J Shyamala Rao Takes Charge

సాక్షి,తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్‌ అధికారి జె. శ్యామలరావు ఆదివారం(జూన్‌16) బాధత్యలు స్వీకరించారు. 

సంప్రదాయం ప్రకారం ఆయన ముందుగా వరాహస్వామిని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు ఛార్జ్‌ ఇచ్చారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. జేఈవోలు తీర్థప్రసాదాలు అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement