తిరుపతి జిల్లా: తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణకు డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. ఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం మెయిన్ గేట్ ఎదుట వైఎస్సార్సీపీ చంద్రగిరి ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. రిటైర్డ్ జడ్జి గుర్రప్ప నాయుడును భూతులు తిట్టిన ఎమ్మెల్యే నాని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


