ఎన్నికల్లో ఓడిపోయా.. డబ్బులు ఇయ్యి: టీడీపీ నేత

TDP Leader Demands Amount On Granite Manager In Anantapur - Sakshi

అనంతపురం: తెలుగు దేశం పార్టీ నాయకుడు బరి తెగించాడు. గ్రానైట్‌ మేనేజర్‌ను రూ.50 వేలు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేశానని.. వాటిని తిరిగి సంపాదించేందుకు సహకరించాలని మేనేజర్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ ఘటన అనంతపురము జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురము జిల్లా కుర్తికోటలో టీడీపీ నేత రెడ్డి శేఖర్‌ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఓటుకు రూ.2 వేలు పంచానని.. ఆ డబ్బులు తిరిగి సంపాదించేందుకు సహకరించాలని మేనేజర్‌ను శేఖర్‌ కోరాడు. దీంతో తనకల్లులో మారుతి గ్రానైట్‌ మేనేజర్‌ను బెదిరించాడు. నెలకు రూ.50 వేలు రౌడీ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బు కోసం ఈ విధంగా పట్టపగలు బెదిరింపులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో టీడీపీ నేత రెడ్డి శేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top