గుంటూరు: వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ గూండాలు బరితెగించి మరీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. పొన్నూరు 13వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మనోహర్, వెంకటరత్నంలపై కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు.
ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెంకటరత్నం, మనోహర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోజు వ్యవధిలో వారిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం రెండోసారి.


