సికింద్రాబాద్‌–విజయవాడ మధ్య ప్రత్యేక రైలు 

Secunderabad To Vijayawada special train Said South Central Railway In Statement - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌–విజయవాడ మధ్య రెండు రోజుల పాటు ప్రత్యేక ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైలు (07567) ఈ నెల 17, 18 తేదీల్లో ఉదయం 8.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

తిరిగి ఈ రైలు (07568) మధ్యాహ్నం 3.55 గంటలకు విజయవాడలో బయలుదేరి, రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మౌలాలీ, చెర్లపల్లి, బీబీ నగర్, రామన్నపేట, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూర్‌ స్టేషన్‌లలో ఆగుతుంది.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top