రాజమండ్రి: రూట్‌ మార్చిన చిరుత | SEARCHING FOR CHIRUTHA AT KADIYAM NURSERY | Sakshi
Sakshi News home page

రాజమండ్రి: రూట్‌ మార్చిన చిరుత.. కడియంలో భయం

Sep 25 2024 8:14 AM | Updated on Sep 25 2024 8:46 AM

SEARCHING FOR CHIRUTHA AT KADIYAM NURSERY

రాజమహేంద్రవరం రూరల్‌/కడియం: దివాన్‌ చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుత పులి కడియం నర్సరీ ప్రాంతానికి చేరినట్టు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. కడియం – వీరవరం రోడ్డు మధ్యలోని దోసాలమ్మ కాలనీలో చిరుత జాడలు కనిపించాయి. దీంతో కాలనీ వాసులందరూ భయాందోళనకు గురయ్యారు. 

విషయం తెలుసుకున్న దివాన్‌ చెరువు ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ పద్మావతి, రేంజర్‌ శ్రీనివాస్, స్క్వాడ్‌ డీఆర్‌వో రాజా అండ్‌ టీమ్, రేంజ్‌ పరిధిలోని సిబ్బంది ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అవి చిరుత పాదముద్రలే అని గుర్తించారు. అయితే అది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే విషయం అంతుపట్టడం లేదు. 

కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. పులి భయంతో నర్సరీల్లో రైతులెవ్వరూ ఉండడం లేదు. చిరుత ఈ ప్రాంతంలోనే ఉందా, ఎక్కడికైనా వెళ్లిందా అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, కూలీలకు బుధవారం నర్సరీలకు వెళ్లవద్దని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement