విజయవాడలో సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ | Sea Food Festival in Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో సీ ఫుడ్‌ ఫెస్టివల్‌

Jul 15 2023 4:23 AM | Updated on Jul 15 2023 4:23 AM

Sea Food Festival in Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి:  స్థానిక వినియోగాన్ని పెంచడం, ప్రత్యా­­మ్నాయ మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పనే లక్ష్యంగా విజయవాడలో 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌ కూనపురెడ్డి కన్నబాబు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నం.1 స్థానంలో ఉన్న రాష్ట్రంలో స్థానిక వినియోగం 8 శాతానికి మించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 75 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతు­న్నా­యన్నారు. కానీ వినియోగం మాత్రం 5 శాతం లోపే ఉందని చెప్పారు.

మిగిలిన  రొయ్య అంతా ఎగు­మతి అ­వు­తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకు­లు ఎదురైతే రాష్ట్రంలోని రొయ్య రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే డొమెస్టిక్‌ మార్కెట్‌ను పెంచుకో­వాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో సీ ఫుడ్‌ వినియోగదా­రులు పెద్ద ఎత్తున ఉన్నా.. డిమాండ్‌కు తగ్గట్టుగా రిటైల్‌ షాపులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారిందన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ‘ఫిష్‌ ఆంధ్రా’ బ్రాండ్‌తో స్థానిక వినియోగం పెంచేలా ఆక్వా హబ్స్‌ అండ్‌ స్పోక్‌ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1,500 అవుట్‌ లెట్స్‌ను ఏ­ర్పాటు చేయగా.. 15 హబ్స్‌ నిర్మాణంలో ఉన్నట్టు చెప్పా­­రు. మ­రిన్ని హబ్స్, అవుట్‌ లెట్స్‌ ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సా­హికులను ప్రోత్సహించడం, వినియోగదారు­ల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సీ ఫుడ్‌ ఫెస్టివల్‌­ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మూడు రోజుల పాటు నిర్వ­­హించే ఫెస్టివల్‌లో 20 వేల మంది సందర్శకులు వ­స్తా­­రని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఫెస్టివల్‌లో రో­జూ రూ.699తో అపరిమితమైన సీ ఫుడ్‌ బఫెట్‌ను అందిస్తు­న్నా­మన్నారు. సీ ఫుడ్‌పై వంటల పోటీలు, వైద్యులు, పో­షకాహార నిపుణులతో సెమినార్లు, 2కే రన్‌ నిర్వహంచనున్నట్టు తెలిపారు. ఇలాంటి సీ ఫుడ్‌ ఫెస్టివల్స్‌ విశాఖ, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాలతో పా­టు హైద­రాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనూ నిర్వ­హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్‌ బ్రోచర్‌ను కమిషనర్‌ కన్నబాబు విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement