సాక్షి ,అల్లూరి : తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా సమాచారం. కూలిపనుల కోసం అరకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


