
వేలాది పక్షి జాతుల నిలయంగా పాపికొండలు అటవీ ప్రాంతం అలరాలుతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 1,01,200 హెక్టార్లలో ఇది విస్తరించి ఉంది. వేసవిలోనూ ఇక్కడ చల్లటి వాతావరణం ఉండటంతో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది పక్షుల గణనలో 46,700 వరకు వివిధ రకాల పక్షి జాతులున్నట్టు గుర్తించామని వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజనల్ ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ మడ అడవుల వద్ద క్రిస్టడ్ సర్పెంట్ ఈగల్(నల్ల పాముల గద్ద), మలబార్ పైడ్ హార్న్బిల్, స్కేర్లెట్ మినివెట్, ఇండియన్ స్కిమ్మర్తో పాటు మరో ఆరు రకాల అరుదైన వలస పక్షులను గుర్తించినట్టు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అధికారి మహేష్ చెప్పారు. – బుట్టాయగూడెం