కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

Rains in Coastal Andhra and Rayalaseema during next 48 hours - Sakshi

నేడూ, రేపూ ఉరుములతో కూడిన వర్షాలు

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర మధ్యప్రదేశ్‌ మధ్య ప్రాంతం, దక్షిణ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమెరిన్‌∙ ప్రాంతం వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి కేంద్రం శనివారం రాత్రి ప్రకటించింది.      

► ఉత్తర కోస్తాంధ్రా, దక్షిణ కోసాంధ్రా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో  ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు  చోట్ల  కురిసే అవకాశం ఉంది.
► శనివారం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. అనేక చోట్ల ఒక టి లేదా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top