వాగులో కొట్టుకుపోతూ బయటపడి.. ఒక్కసారిగా..

Person Drowned In Water And Deceased At Gooty - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుత్తి మండలం కొజ్జేపల్లి వాగులో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే బయటకు తీసుకురాగానే ఒక్కసారిగి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. మృతుడు గొల్లలదొడ్డి చెర్లోపల్లికి చెందిన శ్రీరాములుగా గుర్తించారు. కాగా ఇదే వాగులో మరో లారీ, ఆటో కూడా చిక్కుకున్నాయి. అయితే స్థానికులు వెంటనే స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top