పార్లమెంట్‌లో నేడు ఏపీ ప్రత్యేక హోదా సహా పలు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులు

Parliament Budget Session: YSRCP MPs Introduce Private Member Bills - Sakshi

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేటితో నాలుగవ రోజుకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టనున్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. 

ఏపీ విభజన చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ.. ఎంపీ మిథున్‌రెడ్డి ప్రైవేట్‌మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అలాగే మిరప ప్రమోషన్‌, అభివృద్ధిపై.. ఎంపీ కృష్ణదేవరాయలు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టనున్నారు. వ్యవసాయ విపత్తుల నష్టపరిహారంపైన ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top