
చెట్ల సంఖ్యపై జాతీయ 2025 పర్యావరణ గణాంకాలు వెల్లడి
తొమ్మిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్
2019–22 మధ్యకాలంలో ఏపీలో చదరపు కిలో మీటర్కు పెరిగిన చెట్లు 93
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా చెట్ల సంఖ్య పెరుగుదలలో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. 2019–20లో చదరపు కిలోమీటరుకు 10363 చెట్లుండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య 10841కు చేరింది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయని జాతీయ పర్యావరణం–2025 తెలిపింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఈ నివేదికను వెల్లడించింది.
దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2019–20తో పోల్చితే 2021–22 నాటికి 93 చెట్లు పెరిగినట్లు వివరించింది. అసోం, బీహార్, గోవా, గుజరాత్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2019–20తో పోల్చితే 2021–22లో చెట్ల సంఖ్య తగ్గిపోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. తెలంగాణ 11వస్థానం సాధించింది. కాగా చెట్ల సంఖ్య పెరుగుదలలో సిక్కిం చివరిస్థానంలో నిలిచింది. 2019–20లో చదరపు కిలోమీటరుకు 51 చెట్లుండగా , 2021–22 నాటికి వాటి సంఖ్య 48కు తగ్గిందని నివేదిక వెల్లడించింది.
