విద్యార్థినులకు ‘ప్రగతి’ సాయం | Notification for scholarships in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

విద్యార్థినులకు ‘ప్రగతి’ సాయం

Aug 19 2025 5:58 AM | Updated on Aug 19 2025 5:59 AM

Notification for scholarships in Andhra Pradesh

ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్‌ 

సాంకేతిక విద్యలో డిగ్రీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థినులకు అవకాశం

సాక్షి, అమరావతి: విద్యార్థినులకు ఆర్థిక సహాయార్థం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ‘ప్రగతి స్కాలర్‌ షిప్‌’లను అందిస్తోంది. ఈ పథకం సాంకేతిక విద్యలో డిగ్రీ, డిప్లొమా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ మేరకు (ఆన్‌లైన్‌లో) అర్హత కలిగిన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహా్వనిస్తోంది. అక్టోబర్‌ 31లోగా జాతీయ స్కాలర్‌ షిప్‌ పోర్టల్‌   https:// scholarships. gov.in/  ద్వారా దరఖాస్తులు సమర్పించాలంది. ఆధార్‌ బ్యాంకు లింకు చేసిన అకౌంట్‌ను జత చేయాలని పేర్కొంది.

ఈ పథకానికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షల కంటే తక్కువ ఉన్న వారు అర్హులు. ఇలా ప్రతి కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు బాలికల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఏఐసీటీ ఈ ఆమోదించిన సంస్థల్లో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న (లేటరల్‌ ఎంట్రీ అయినా) విద్యార్థినులకు ఏడాదికి రూ.50వేలు చొప్పున స్కాలర్‌షిప్‌ ఇవ్వనుంది. డిగ్రీ స్థాయిలో గరిçష్టంగా నాలుగేళ్లు ఇలా సహయాన్ని ఇస్తోంది. డిప్లొమాలో చేరిన విద్యార్థినులకు సైతం ఈ పథకాన్ని గరిష్టంగా మూడేళ్లు ఇవ్వనుంది. ఈ సహాయాన్ని ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, కంప్యూటర్లు, స్టేషనరీ వంటి పరికరాల ఖర్చుల నిమిత్తం ఏక మొత్తంలో అందించనుండటం విశేషం. 

అర్హులందరికీ... 
దేశంలో 23 రాష్ట్రాల్లో ఏటా 10వేల స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. వీటికి అదనంగా 13 రాష్ట్రాలు/కేంద్ర పాలిక ప్రాంతాల్లో ఎంత మంది అర్హత కలిగిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకుంటే అందరికీ స్కాలర్‌షిప్‌ను మంజూరు చేయనుంది.

సమర్పించాల్సిన పత్రాలు (నకలు).. 
ఎస్‌ఎస్‌ఈ ధ్రువపత్రం 
హెచ్‌ఎస్‌సీ/12వ తరగతి (డిగ్రీ లెవల్‌ విద్యార్థినులకు) 
ఐటీఐ ధ్రువపత్రం (డిప్లొమా విద్యార్థినులకు) 
బ్యాంకు పాస్‌బుక్‌ 
కుల ధ్రువీకరణ పత్రం 
ఆధార్‌ కార్డు 
స్టడీ ధ్రువపత్రం 
వార్షిక ఆదాయ ధ్రువపత్రం 
తల్లిదండ్రుల డిక్లరేషన్‌ 
బ్యాంకు మ్యాన్‌డేట్‌ ఫారమ్‌ 

Advertisement
 
Advertisement
Advertisement