ఏపీలో అందరికీ సమాన అవకాశాలు 

Nick Vujicic Praises CM YS Jagan - Sakshi

ప్రభుత్వ స్కూళ్లు బాగున్నాయి.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారు

విద్యార్థులు ఎదగడానికి మంచి అవకాశాలు సృష్టించారు.. ఇలా ఎక్కడా చూడలేదు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నా

ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌  ప్రశంసలు

సాక్షి, అమరావతి: ‘ఇప్పటివరకు 78 దేశాల్లో పర్యటించా. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న సీఎం జగన్‌ లాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు’ అని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ చెప్పారు. సీఎం అత్యున్నత లక్ష్యం కోసం.. ఉన్నతమైన ఆశయాలతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఆయన్ని కలవడాన్ని గౌరవంగా భావి­స్తున్నా­నన్నారు.

బుధవారం  క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను ఆయన కలిశారు.  ‘ప్రైవేటు స్కూళ్లకు తీసిపోనిరీతిలో ఏపీలో ప్రభుత్వ స్కూళ్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారు. విద్యా రంగంలో అందరికీ సమానావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌ పనిచేస్తుండటం.. చాలా ఆసక్తికరం.

ఏపీ­లో విద్యార్థుల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయి. ఈ విషయంలో సీఎం జగన్‌ గురించి చెప్పా­లంటే ఆయన నిజమైన హీరో. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గణనీయ ప్రగతి కనిపిస్తోంది. ఇవన్నీ అందరికీ తెలియాలి. ఇంతవరకూ ఇలా ఎక్కడా జరగలేదు. ఆయన చాలా నిబద్ధత, క్రమశిక్షణ గల మనిషి’ అని నిక్‌ చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top