ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులు చేపట్టిన ఎన్‌హెచ్‌ఏఐ

NHAI Starts 42 Oxygen Plants Construction Work In AP - Sakshi

సాక్షి, అమరావతి : నేషనల్‌ హైవే అథారిటీ ఆంధ్రప్రదేశ్‌లో 42 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు పనులను మొదలుపెట్టింది. ఆదివారం తొలివిడతగా 4 ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టింది. హిందూపురంలో 1000 ఎల్‌పీఎం సామర్థ్యంతో ప్లాంట్‌.. అమలాపురంలో 500 ఎల్‌పీఎం, మదనపల్లెలో 500 ఎల్‌పీఎం.. తాడేపల్లి గూడెంలో 1000 ఎల్‌పీఎం సామర్థ్యంతో ప్లాంట్ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే 3 ప్లాంట్ల నిర్మాణ పనులు చేపట్టింది. అధికారులు రేపు అమలాపురంలో ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. మిగిలిన 38 ప్లాంట్ల ఏర్పాటుకు కూడా స్థలాలు ఖరారయ్యారు. ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రుల వద్ద ప్లాంట్ల ఏర్పాటు జరగనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top