ఏపీలో కొత్తగా 13,756 కరోనా కేసులు

New Corona Positive Cases Reports Ap 29 May 2021 - Sakshi

 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 79,564 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 13,756 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 20,392 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 87 వేల 382 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 1,90,88,611 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,73,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 666, విజయనగరం- 397, విశాఖ- 1004, తూ.గో- 2301, ప.గో- 1397, కృష్ణా- 782, గుంటూరు- 780, ప్రకాశం- 811, నెల్లూరు- 865, చిత్తూరు- 2155, అనంతపురం- 1224, కర్నూలు- 742, వైఎస్ఆర్ జిల్లా- 632 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా కరోనా మృతుల సంఖ్య.. పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి, చిత్తూరు జిల్లాలో 13, విశాఖ జిల్లాలో 10 మంది మృతి, తూ.గో, అనంతపురం జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి, గుంటూరు, కృష్ణా జిల్లాలో 8 మంది చొప్పున మృతి, కర్నూలు జిల్లాలో ఏడుగురు, నెల్లూరు జిల్లాలో ఆరుగురు మృతి, విజయనగరం జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు మృతి, కరోనాతో వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు.

చదవండి: మళ్లీ రహస్య ప్రాంతానికి ఆనందయ్య

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top