ఏపీలో కొత్తగా 16,167 కరోనా కేసులు

New Corona Positive Cases Reports Ap 27 May 2021 - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 84,224 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 16,167 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 21,385 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 46 వేల 244 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 1,89,24,545 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  ప్రస్తుతం 1,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి చిత్తూరు జిల్లాలో 14, ప.గో.జిల్లాలో 13, గుంటూరు, విజయనగరం జిల్లాలో 8.. అనంతపురం, నెల్లూరులో 9, ప్రకాశంలో 7, విశాఖ జిల్లాల్లో 11 మంది, తూ.గో లో ఆరుగురు, కర్నూలు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు చొప్పున మొత్తం 104 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 10531 మంది మరణించారు.

చదవండి: ‘ఈ ఆస్పత్రులను క్షమిస్తే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లే’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top