పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి | Man Wakes UP While His Own Funeral At Chittoor | Sakshi
Sakshi News home page

పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి

Dec 22 2020 1:11 PM | Updated on Dec 22 2020 1:43 PM

Man Wakes UP While His Own Funeral At Chittoor - Sakshi

చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి 

మదనపల్లె టౌన్‌/చిత్తూరు :  పాడెపై తీసుకెళుతున్న ఓ వ్యక్తి లేచి కూర్చున్న సంఘటన మదనపల్లె మండలంలో సోమవారం జరిగింది. వీఆర్వో కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి మండలంలోని  కట్టుబావి గ్రామంలో చెట్టు కింద రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ విషయం గుర్తించిన గ్రామస్తులు గ్రామ కార్యదర్శి మనోహర్, వీఆర్వో నాగరాజుకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని అతడిని పరిశీలించి చనిపోయాడని భావించారు. ఊరికి సమీపంలో గుంతను తవ్వించి, పాడెపై మోసుకెళుతుండగా ఒకసారిగా లేచి కూర్చున్నాడు. వెంటనే అతడిని 108 వాహనంలో మదన పల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించడంతో కోలుకు న్నాడు. అయితే అతని వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement