నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి

Laxmi Parvathi Speak On Municipal Elections 2021 YSRCP Victory - Sakshi

సాక్షి, తాడేపల్లి: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంప పెట్టు అని ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన కొడుకును వారసుడిగా చేయాలన్న ఆశయం పోయిందని, లాక్కున్న పార్టీని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీ పార్టీని భూస్థాపితం చేశాడని, ఇక తండ్రీ కొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. తన భర్తకు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు వచ్చిందని తెలిపారు.

సీఎం జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడని లక్ష్మీపార్వతి తెలిపారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులైతే ఇకనైనా చంద్రబాబును వదిలేయండని చెప్పారు. టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని తెలిపారు. మరో 30 ఏళ్లు సీఎం జగన్ ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. తన భర్తను అవమానించిన పార్టీ ఉంటే ఏమిటి ఊడితే ఏమిటని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు పని అయిపోయిందని, ఆత్మ విమర్శ చేసుకోవడానికి తన మైండ్ కూడా చెడిపోయిందని ధ్వజమెత్తారు. బాబు చేసిన పాపాలు తన కొడుకు రూపంలో శాపంగా మారాయని ఆమె విమర్శించారు.

చదవండి: ‘ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవు’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top