టీటీడీ ఈవోగా కేఎస్‌ జవహర్‌ రెడ్డి | KS Jawahar Reddy Appointed As Tirumala Tirupati Temple EO | Sakshi
Sakshi News home page

టీటీడీ ఈవోగా కేఎస్‌ జవహర్‌ రెడ్డి

Oct 8 2020 8:25 AM | Updated on Oct 8 2020 8:36 AM

KS Jawahar Reddy Appointed  As Tirumala Tirupati Temple EO - Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కేఎస్‌ జవహర్‌ రెడ్డిని నియమిస్తూ బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు. జవహర్‌రెడ్డి ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజుల కిందటే టీటీడీ ఈవోగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. (బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకారం)

9న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఈ నెల 15 నుంచి 24 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 9న ఉదయం 11 గంట లకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement