తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 27 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని 78,067 మంది దర్శించుకున్నారు. 31,158 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.39 కోట్లు సమర్పించారు.
టిటిడి లడ్డులు 4.16 లక్షలు విక్రయించింది. సర్వదర్శనానికి 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.


