
సాక్షి,విజయవాడ:మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముందస్తు బెయిల్ లభించింది. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది.
అయితే, ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. కిందికోర్టులో బెయిల్ తీసుకోవాలని కొడాలి నానికి హైకోర్టు ఆదేశించింది. ఆదేశాల మేరకు కొడాలి నాని శుక్రవారం గుడివాడ కోర్టులో ష్యూరిటీ పత్రాలు సమర్పించారు. అనంతరం,ముందస్తు బెయిల్ పొందారు.