ఆటోలను నిషేధించాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి | Jc Prabhakarreddy Comments On Auto Accidents | Sakshi
Sakshi News home page

ఆటోలను నిషేధించాలి..వాటి వల్లే ప్రమాదాలు: జేసీ ప్రభాకర్‌రెడ్డి

Nov 24 2024 12:56 PM | Updated on Nov 24 2024 4:02 PM

Jc Prabhakarreddy Comments On Auto Accidents

సాక్షి,అనంతపురం:ఆటోలపై టీడీపీ సీనియర్‌ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిషేధించాలని జేసీ డిమాండ్‌ చేశారు.

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లిలో శనివారం(నవంబర్‌ 23) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందడంపై జేసీ స్పందించారు.

‘ఆటోలను నిషేధించాలి. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే. డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఆటోల వల్లే ప్రతి నెలా 60 మంది చనిపోతున్నారు. 

తలగాసిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా సరిపోదు. ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఈ విషయం చంద్రబాబునాయుడుకు అధికారులు చెప్పాలి’అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 

ఇదీ చదవండి: అసెంబ్లీలో ఆ విషయం మర్చిపోయావా.. అఖిలప్రియా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement