
కర్నూలు: శునకం, వరాహం ఈ రెండు మూగ జీవాల మధ్య జాతి వైరం తీవ్రంగా ఉంటుంది. రెండు తారసపడితే శత్రుత్వం ప్రదర్శిస్తాయి. సహజంగా పందులు కనిపిస్తే కుక్కలు వెంటబడి తరిమేస్తాయి. కుక్క పిల్లలు కనిపిస్తే పందులు కసితీరా గాయపర్చుతాయి. ఇలాంటి జాతి వైరం ఉన్న జంతువుల మధ్య మాతృప్రేమ వికసించింది. శుక్రవారం అంకిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని రామాలయం ఆవరణలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఓ వీధికుక్క పిల్లలకు జన్మనించింది.
తల్లి కుక్కను ఇతర కుక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడి కొద్ది రోజుల నుంచి పిల్లల వద్దకు రాకుండా దూరంగా ఉంటుంది. చిన్న వయసులో ఉన్న కుక్క పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ సమయంలో వరాహం అక్కడికి చేరడంతో కుక్క పిల్లలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలు తాగడం ఆరంభించాయి. వరాహం కూడా కుక్క పిల్లలను ఏమీ అనకుండా కట్టు కదలకుండా పాలు ఇచ్చి అమ్మలా ఆకలి తీర్చింది. ఈ దృశ్యాన్ని కాలనీ వాసులు చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.