Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Huge rush of devotees at Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Apr 1 2024 9:11 AM | Updated on Apr 1 2024 9:11 AM

Huge rush of devotees at Tirumala - Sakshi

తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి  21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న  81,224 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,093 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం  8   కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..  5  గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం   4.35   కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement