గ్రూప్‌–2 మెయిన్స్‌ ఫలితాలు విడుదల | Group2 Mains results released | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 మెయిన్స్‌ ఫలితాలు విడుదల

Apr 5 2025 5:35 AM | Updated on Apr 5 2025 5:35 AM

Group2 Mains results released

సాక్షి, అమరావతి: గ్రూప్‌–2 మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 905 పోస్టులకుగాను 1:2 నిష్పత్తిలో 2,168 మందితో ప్రొవిజినల్‌ లిస్టును వెల్లడించింది. అందులో 370 మంది స్పెషల్‌ కేటగిరి అభ్యర్థులున్నారు. వీరందరికీ త్వరలో కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహించిన తర్వాత తుది అభ్యర్థులను ప్రకటిస్తారు. 

గ్రూప్‌–2పై కోర్టులో కేసులున్నా ఫలితాల ప్రకటనపై కోర్టు అభ్యంతరం తెలపకపోవడంతో శుక్ర­వారం రాత్రి ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన ఫైనల్‌ కీ ని ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది.    

Advertisement
 
Advertisement
Advertisement