
నేడు నోటిఫికేషన్ జారీ, రేపు నామినేషన్ల స్వీకరణ
పురందేశ్వరి కొనసాగే అవకాశాలు తక్కువే
రేసులో కిరణ్కుమార్రెడ్డి !
సాక్షి, అమరావతి: ప్రతి మూడేళ్లకొకసారి జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ను ప్రకటించారు. జూన్ 29న (ఆదివారం) రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ జారీతోపాటు అధ్యక్ష ఎన్నిక ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్టు వెల్లడించారు.
30న (సోమవారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య నామినేషన్ దాఖలు.. అనంతరం ఒక గంటపాటు నామినేషన్ల స్రూ్కటినీ.. సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వివరించారు. ఒకటో తేదీన పోలింగ్, రాష్ట్ర అధ్యక్ష పేరు ఖరారు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తారని వివరించారు.
రేసులో సుజనా చౌదరి, జీవీఎల్ కూడా!
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పోటీ పడుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పురందేశ్వరి కొనసాగే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన అధినేతల సూచనలు పరిగణనలోకి తీసుకుంటే తప్ప ఆమె మరో విడత కొనసాగే అవకాశాలు లేవని పార్టీలో చర్చ సాగుతోంది.
అధ్యక్ష మారి్పడి జరిగే పక్షంలో తమ పేర్లు పరిశీలించాలంటూ కిరణ్కుమార్రెడ్డితోపాటు పార్టీ సీనియర్ నేతలు పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహరావు, సుజనాచౌదరి, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరినట్టు సమాచారం.