ట్రిపుల్‌ ఐటీలకు 9 వరకు దసరా సెలవులు  | Dussehra holidays till October 9 for IIIT | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీలకు 9 వరకు దసరా సెలవులు 

Oct 2 2022 6:30 AM | Updated on Oct 2 2022 2:51 PM

Dussehra holidays till October 9 for IIIT - Sakshi

నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు,  శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు 9వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించారు. దీంతో ట్రిపుల్‌ ఐటీలకు చెందిన విద్యార్థులందరూ శనివారం ఇంటిబాట పట్టారు. సెలవుల నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలోని విద్యార్థులందరూ నేరుగా వారి ప్రాంతాలకు చేరుకునేందుకు గాను ఆర్టీసీ నూజివీడు అధికారులు ట్రిపుల్‌ ఐటీ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

దాదాపు 8 వేల మంది విద్యార్థులుండగా వారి కోసం  రాజమండ్రి, అమలాపురం, రాజోలు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు 56 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో ఈ బస్సలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విద్యార్థులను వారి ప్రాంతాలకు తీసుకెళ్లాయి. అయితే దూర ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడ, హనుమాన్‌ జంక్షన్‌ రైల్వేస్టేషన్‌లకు వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement