డిజిటిల్ అసిస్టెంట్‌ సస్పెస్షన్‌

Digital Assistant Suspended In Anantapur District - Sakshi

అనంతపురం: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తలుపుల మండలం పులిగుండ్లపల్లి గ్రామ సచివాలయ డిజిటిల్ అసిస్టెంట్‌ నరేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు మండల ఎంపీడీఓ విష్ణుప్రసాద్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో పాటు అర్హులైన నలుగురికి నేతన్న నేస్తం అందకపోవడంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ అలసత్వమే కారణమని గుర్తించామన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించడంతో సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top