Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | Devotees Rush at Srisailam Temple | Sakshi
Sakshi News home page

Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Mar 24 2025 8:42 AM | Updated on Mar 24 2025 9:43 AM

Devotees Rush at Srisailam Temple

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు.   ఆదివారం అర్ధరాత్రి వరకు 84,198 మంది స్వామిని దర్శించుకున్నారు.  26,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.98 కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ (  ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.   

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులుఉగాది సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆలయంలోని క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయాయి. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. క్యూ లైన్లలోని భక్తులకు ఆలయ సిబ్బంది అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు. శ్రీశైలం వీధులు... భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్ణాటక నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దోర్నాల, తెలంగాణ నుంచి వందల సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా రావడంతో... ట్రాఫిక్ పెరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement