
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే సమర్థమంతమైన పాలన అందిస్తున్న సీఎంల్లో జగన్ ఒకరు.. అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ మన్ననలను సీఎం జగన్ పొందారన్నారు. మరో 30 ఏళ్లపాటు జగన్ పాలన ఉండేలా ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని కోరారు.విద్య, వైద్యం, వ్యవసాయానికి సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వంలో రైతులు వలస కూలీలుగా బాధలు పడ్డారని, రాష్ట్రంలో రైతులను సీఎం జగన్ రైతు భరోసాతో ఆదుకుంటున్నారని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.(చదవండి: ‘ఆ భయంతోనే కులమతాల మధ్య చిచ్చు..’)