ఏపీలో కొత్తగా 10,368 కరోనా కేసులు

Coronavirus: 10368 New Positive Cases Registered In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 59,834 నమూనాలు పరీక్షించగా 10,368 పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,139 కు చేరింది. కొత్తగా 84 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,053కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 9,350 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 3,39,876 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 37,82,746 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,210 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (చదవండి : ఏపీలో రెండోసారి కరోనా రాలేదు..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top