
అర్ధరాత్రి దాటినా వెలువడని ఫలితాలు
సాక్షి, అమరావతి: జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(మెయిన్) సెషన్–2 ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులకు ఎటువంటి అప్డేట్ ఇవ్వని ఎన్టీఏ.. ఫలితాల విడుదలలో దోబూచులాడింది.
సాయంత్రం తుది ఆన్సర్ కీ విడుదల చేసినట్టే చేసి, కొద్దిసేపటికే వెబ్సైట్ నుంచి తొలగించింది. ఫలితాల విడుదల, ఆన్సర్ కీలపై అప్డేట్ లేకుండా విద్యార్థులను గందరగోళానికి గురిచేయడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.