ఏప్రిల్‌ 1న కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోనున్న సీఎం జగన్‌

CM YS Jagan To Take Covid Vaccine In Guntur On April 1st - Sakshi

సాక్షి, గుంటూరు: ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోనున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు. భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయాన్ని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కోవిడ్‌ నియంత్రణకు అన్నిచర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ముందున్నామన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచి సచివాలయాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రజల్లో అపోహలు తొలగాలి, ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటించాలని ఎంపీ మోపిదేవి సూచించారు.
చదవండి:
ఉపాధిహామీ: ఏపీ సర్కార్ సరికొత్త రికార్డు.. 
ఆవిర్భావ దినోత్సవం రోజే టీడీపీకి షాక్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top