మార్చి 28న నెల్లూరుకు సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan to Nellore for Gautam Reddy Memorial Event - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం (మార్చి 28) ఉదయం ఆయన కృష్ణా జిల్లా గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకొని జిల్లా నాయకులతో మాట్లాడతారు. అనంతరం నెల్లూరులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకొని దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొంటారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top