బిపిన్‌ రావత్‌ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

CM YS Jagan Expressed Grief Over Death Of Bipin Rawat - Sakshi

సాక్షి, అమరావతి: బిపిన్‌ రావత్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలిన సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌ ప్రమాద ఘటన వార్తతో కలత చెందానన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చదవండి: Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top