కేసులు ఎత్తివేయాలని ఏపీ సీఎం నిర్ణయం
సాక్షి, నెల్లూరు: జిల్లాలో రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సంగంలో రైతులు ధర్నా చేశారు. రైతులపై పోలీసులు కోవిడ్(కరోనా) నిబంధన ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు. ఈ సాయంత్రం సీఎం జగన్ దృష్టికి రైతుల కేసుల వ్యవహారం రావడంతో, తక్షణం స్పందించిన సీఎం జగన్ రైతులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
సంబంధిత వార్తలు