అనంతపురంలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన దోశ | Child Dies After Getting Piece Of Dosa Stuck In His Throat In Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన దోశ

Jul 20 2025 10:22 AM | Updated on Jul 20 2025 11:31 AM

Child Dies After Getting Piece Of Dosa Stuck In His Throat In Anantapur

అనంతపురం: అనంతపురంలో దోశ ముక్క గొంతులో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. అనంతపురంలోని తపోవనంలో నివాసం ఉండే అభిషేక్, అంజినమ్మ దంపతుల రెండేళ్ల కుమారుడు కుషాల్‌. శనివారం ఉదయం స్థానిక తపోవనం సర్కిల్‌లోని ఓ హోటల్‌లో తల్లిదండ్రులు దోశ తినిపిస్తుండగా, దోశ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది.

హుటా­హుటిన స్థానిక ప్రభుత్వ సర్వజ­నాసుపత్రికి తరలించారు. చిన్నారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే కుషాల్‌ మృతి చెందాడు. కళ్ల ముందే చిన్నారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement