అనంతపురంలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన దోశ | Child Dies After Getting Piece Of Dosa Stuck In His Throat In Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన దోశ

Jul 20 2025 10:22 AM | Updated on Jul 20 2025 11:31 AM

Child Dies After Getting Piece Of Dosa Stuck In His Throat In Anantapur

అనంతపురం: అనంతపురంలో దోశ ముక్క గొంతులో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. అనంతపురంలోని తపోవనంలో నివాసం ఉండే అభిషేక్, అంజినమ్మ దంపతుల రెండేళ్ల కుమారుడు కుషాల్‌. శనివారం ఉదయం స్థానిక తపోవనం సర్కిల్‌లోని ఓ హోటల్‌లో తల్లిదండ్రులు దోశ తినిపిస్తుండగా, దోశ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది.

హుటా­హుటిన స్థానిక ప్రభుత్వ సర్వజ­నాసుపత్రికి తరలించారు. చిన్నారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే కుషాల్‌ మృతి చెందాడు. కళ్ల ముందే చిన్నారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement