ఆదాయం భారీగా పెంచాలి | Chief Minister Chandrababu Naidu in review of various departments | Sakshi
Sakshi News home page

ఆదాయం భారీగా పెంచాలి

May 14 2025 4:45 AM | Updated on May 14 2025 4:45 AM

Chief Minister Chandrababu Naidu in review of various departments

అప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేయగలం

ఈ ఏడాది రూ.1,34,208 కోట్లు లక్ష్యం

బంగారం కొనుగోళ్లకు తగ్గట్లు పన్ను రావడం లేదు

ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలి

ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు

వివిధ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆదాయం మరి­ంతగా పెంచేందుకు ఉన్న అను­కూ­లతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖ­ల­న్నీ లోతైన అధ్యయనం చేయా­లని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హై­ద­రాబాద్‌ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని, మనకు అటువంటి అవకాశం లేనందున ఆదా­యం పెంచుకునే మార్గాలను మరింతగా అన్వే­షి­ంచాలన్నారు. మంగళవారం సచివాలయ­­ంలో ఆయన ఆదాయార్జన శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బంగా­రం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశ­ంలోనే ముందున్నా, పన్ను ఆదా­యం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసు­కోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్‌ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్‌ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. 

మద్యం సరఫరా, అమ్మకాల ట్రాకింగ్‌  
పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా ­తీ­­సు­­కొచ్చి, రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.  కర్ణా­­టక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదా­యం పెరుగుతుంటే.. ఏపీ­లో ఎందుకు తక్కువగా ఉందని  ప్రశి్న­ంచారు. రాష్ట్రంలోని ఎర్ర చందనం నిల్వలను అంతర్జా­తీ­య మార్కెట్‌లో అమ్మేలా కమిటీ ఏ­ర్పా­టు చేసి, నివేదిక ఇవ్వాలని చెప్పారు. ‘2025­–­26 సంవత్సరానికి రాష్ట్ర సొంత ఆదా­యం రూ.­1,34,­208 కోట్లు ఆర్జించాలన్నది లక్ష్యం. ఇది గత ఏడాది కన్నా 29 శాతం అధికం’ అని సీఎం చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement