సెకండియర్‌ సిలబస్‌లోనూ మార్పులు | Changes in Intermediate Second Year Syllabus: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సెకండియర్‌ సిలబస్‌లోనూ మార్పులు

Feb 13 2026 4:43 AM | Updated on Feb 13 2026 4:43 AM

Changes in Intermediate Second Year Syllabus: Andhra Pradesh

2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు

ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ సిలబస్‌లోనూ మార్పులు చేపట్టారు. వాటిని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. జాతీయ విద్యా విధానం–2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్టు గతంలో బోర్డు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ ఫస్టియర్‌లో మార్చిన సిలబస్‌కు అను­గుణంగా సెకండియర్‌ సబ్జెక్టుల సిలబస్, పాఠ్యాంశాలనూ పునర్‌ వ్యవస్థీకరించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు చర్యలు చేపట్టారు.

సైన్సు విభాగం సబ్జెక్టులకు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ ఆధారంగా మార్పులు చేయ­నున్నారు. ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ విభాగం సబ్జెక్టుల­కు ఇంటర్మీడియట్‌ బోర్డు సవరించిన సిలబస్‌ను అమలు చేస్తారు. 2025–26లో సవరించని తెలు­గు, ఉర్దూ, తర్కం, పాలన, భూగోళ శాస్త్రాల సిలబస్‌లనూ మార్చను న్నారు. వృత్తి విద్యా కోర్సులను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ మార్గదర్శకాల ప్రకారం సవరించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement