సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ద్వితీయ స్థానం కోసం పోటీపడుతున్న బీజేపీ, టీడీపీలు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నాయి. ఒక్కో పార్టీ రూ.100 కోట్లు వరకు ఖర్చుచేసేందుకు సిద్ధమయ్యాయి. డబ్బుల పంపిణీ, రోజువారీ ఖర్చు కోసం ఇప్పటికే కొందరికి బాధ్యతలు అప్పగించారు. టీడీపీ విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానంతోపాటు చిత్తూరు జిల్లాలో మరో అసెంబ్లీ స్థానం కేటాయిస్తామని ఓ మహిళా వైద్యురాలికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆమె సోదరుడి ద్వారా టీడీపీ పెద్దలు ఈ ప్రతిపాదన పంపినట్లు సమాచారం. దీంతో ఆమె నుంచి తిరుపతి ఉప ఎన్నికకు అయ్యే మొత్తం ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలిసింది. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తాను ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేనని అధినేత చంద్రబాబుకు ముందే తేల్చిచెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఒప్పుకుంటేనే తాను బరిలో ఉంటానని మాజీమంత్రి ద్వారా సమాచారం అందించారు. ఎన్నికకు అయ్యే ఖర్చు పెట్టేందుకు సదరు మహిళా డాక్టర్ ముందుకొచ్చాకే పనబాక లక్ష్మి ప్రచారంలోకి దిగినట్లు పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాగా, గత కొద్దిరోజులుగా ప్రతి బూత్ పరిధిలో ఖర్చుల కోసం రోజుకు రూ.25 వేలు చొప్పున వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీ కూడా ఖర్చుకు సై
అయితే, ద్వితీయ స్థానం దక్కించుకునేందుకు టీడీపీ భారీ మొత్తంలో ఖర్చుకు వెనుకాడడంలేదని తెలుసుకున్న కమలనాధులు తాజాగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెనుకడుగు వేస్తే ఢిల్లీ పెద్దల వద్ద మాటపడాల్సి వస్తుందని, అందుకని వారు కూడా ఖర్చుకు తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొందరు పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యులు ఇద్దరూ ఎన్నికలకు అయ్యే ఖర్చులో తాము భాగస్వాములం అవుతామని హామీ ఇచ్చారు. చివరికి టీడీపీకి ఏ మాత్రం తగ్గకుండా ఖర్చుచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. మరోవైపు.. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ, టీడీపీ శ్రేణులు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున మద్యం దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.
ద్వితీయ స్థానం కోసం.. బీజేపీ, టీడీపీ పోటాపోటీ ఖర్చు
Published Wed, Apr 7 2021 4:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement