తల్లికి హార్ట్ సర్జరీ.. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్న అవినాష్ రెడ్డి
Published
Sun, May 21 2023 7:30 PM
సాక్షి, వైఎస్సార్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐకి తెలిపారు.
వివరాల ప్రకారం.. తన తల్లి అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల కారణంగా సీబీఐని వారం రోజులు సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. ఆమెకు హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరముంటుందని డాక్టర్లు సూచించారు. ఈ కారణంగా సర్జరీ సమయంలో తాను విచారణ హాజరుకాలేనని అవినాష్ రెడ్డి తెలిపారు.