ఏపీకి వచ్చే వారికి ఆటోమేటిక్‌ ఈ–పాస్‌

Automatic e-pass for those who come to AP - Sakshi

ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల్లో నిబంధనల సడలింపు

స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఈ–పాస్‌.. 

నేటి నుంచి జారీ

సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా అన్‌లాక్‌ 3.0 ప్రారంభమైంది. దీంతో ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిబంధనలు సడలించారు. అన్‌లాక్‌ 3.0 నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు చెక్‌ పోస్టుల్లో ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఆంక్షలు సడలించారు. ఈ సందర్భంగా కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్సు కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలంటే ‘స్పందన’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయన ఇంకా ఏం తెలిపారంటే..

► దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్‌గా ఈ–పాస్‌ మొబైల్, ఈ మెయిల్‌కి వస్తుంది. 
► అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద సిబ్బందికి ఈ–పాస్‌తో పాటు గుర్తింపు కార్డును చూపిస్తే రాష్ట్రంలోకి అనుమతిస్తారు. 
► ఈ–పాస్‌ వివరాల్ని చెక్‌ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు. 
► ఈ నమోదు, వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే. ఈ సమాచారాన్ని ఆరోగ్య కార్యకర్తలకు పంపుతారు. 
► ఆరోగ్య కార్యకర్తలు ఏపీకి వచ్చే వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. నేటి (ఆదివారం) నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది.
► సరిహద్దు చెక్‌పోస్టుల్లో ఈ–పాస్‌ చూపించకపోతే పోలీసులు వెనక్కు తిప్పి పంపుతారు. 
► ఈ–పాస్‌ దరఖాస్తు  www.spandana.ap. gov.in వెబ్‌సైట్‌లో ఉంటుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top