
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం అధికారిక వెబ్సైట్లో ఫలితాలను ఉంచినట్లు పేర్కొంది. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరగనున్నాయని తెలిపింది.
ఏపీలో మొత్తం 81 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి 2024 మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,48,881మంది ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,496మంది మెయిన్స్కు అర్హత సాధించారు. ఈ ఏడాది మే3 నుంచి 9వరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 4వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. నెల రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఇప్పుడు ఫలితాలు విడుదల చేశారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను మౌఖిక పరీక్షలకు ఎంపిక చేశారు.
