ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు | AP High Court Has Issued Notices To Andhra Jyothi | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు

Feb 5 2026 8:28 AM | Updated on Feb 5 2026 8:44 AM

AP High Court Has Issued Notices To Andhra Jyothi

సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రికకు విశాఖలో రూ.కోట్ల విలువైన భూమిని కట్టబెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్ర­యోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆమోద పబ్లికేషన్స్‌ (ఆంధ్రజ్యోతి)కి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన నక్కా నిమ్మిగ్రేస్‌ హైకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయ­మూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయ­మూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement