30,887 మెడికల్‌ పోస్టుల భర్తీకి.. సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ | AP Govt gives green signal for replacement of 30887 medical posts | Sakshi
Sakshi News home page

30,887 మెడికల్‌ పోస్టుల భర్తీకి.. సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌

Aug 10 2020 5:55 AM | Updated on Aug 10 2020 5:55 AM

AP Govt gives green signal for replacement of 30887 medical posts - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా ఆస్పత్రుల్లో వైద్యం, సంబంధిత సేవల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున స్పెషలిస్ట్‌ డాక్టర్లు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (జీడీఎంవో), స్టాఫ్‌ నర్సులు, ట్రైనీ నర్సులు, పారిశుధ్య సిబ్బంది కలిపి మొత్తం 30,887 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 8,439 మందిని నియమించగా మిగతా పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఒకవైపు ఆస్పత్రుల్లో అవసరమైన బెడ్లను ఏర్పాటు చేస్తూనే.. మరోవైపు వైద్య సిబ్బంది నియామకానికి సమాంతరంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నియామకాలన్నీ రెగ్యులర్‌ నియామకాలకు అదనం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement