టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

AP Govt Establish Of Specified Authority For TTD In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు: టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ కన్వీనర్‌గా ఎవి.ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

ఈ సందర్భంగా జవహర్‌రెడ్డిమాట్లాడుతూ.. హిందూ ధార్మిక ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పాలకమండలి నిర్ణయాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. టీటీడీ ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం ముగియడంతో స్పెసిఫైడ్‌ అథారిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

చదవండి: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top