రూ.కోటి దాటిన ప్రతి లావాదేవీలపై రివర్స్‌ టెండరింగ్‌ | AP Government Issued Orders for Reverse tendering Above One Crore Transactions | Sakshi
Sakshi News home page

రూ.కోటి దాటిన ప్రతి లావాదేవీలపై రివర్స్‌ టెండరింగ్‌

Aug 25 2020 9:37 PM | Updated on Aug 25 2020 9:52 PM

AP Government Issued Orders for Reverse tendering Above One Crore Transactions - Sakshi

సాక్షి,విజయవాడ: అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ  మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేపట్టనుంది. కొనుగోళ్లలో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా ఆదేశించింది. కోటి రూపాయల విలువదాటిన ప్రతీ లావాదేవీని రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసింది. టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ పనుల్లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అయ్యిందని ప్రభుత్వం పేర్కొంది. టెండర్ కమ్ రివర్స్ ఆక్షనింగ్ లేదా రివర్స్ టెండర్ల విధానాన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు విధిగా పాటించాలని ప్రభుత్వం  స్పష్టం చేసింది.  రివర్స్ టెండరింగ్ లో ఈ-ప్రోక్యూర్ మెంట్ విధానం అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ను ప్రభుత్వం ఆదేశించింది.  చెల్లింపుల విధానంలోనూ మార్పులు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం  సీఎఫ్ఎస్ఎస్‌కు సూచనలు చేసింది. 

ఛధవండి: క‌రోనా బారిన మంత్రి: వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా భేటీ

Advertisement
 
Advertisement
Advertisement